byసూర్య | Sat, Mar 25, 2023, 09:46 AM
రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పత్తివిత్తనాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీటీ పత్తి విత్తనాల ధరలను నిర్ణయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 475 గ్రాముల బీజీ-1 విత్తనాల ధరను రూ.635గా, బీజీ-2 విత్తనాల ధరలను రూ.853గా ప్రకటించింది. బీజీ-2 విత్తనాల ధర ప్రస్తుతం రూ.810 ఉండగా రూ.853కి పెంచింది. బీజీ-1 విత్తనాల ధరలను గతేడాదిలాగే ఉంచింది.