byసూర్య | Sat, Mar 18, 2023, 06:58 PM
రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంబాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణానికి చెందిన డాక్టర్ మహానంద చౌదరి అందించిన రేషన్ సరుకులను శనివారం ఎమ్మెల్సీ కోటి రెడ్డి పేద ముస్లిం మహిళలకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దృక్పధం తో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహానంద చౌదరి ఔదార్యం అభినందనీయం అన్నారు. ఈనెల 23 నుంచి రంజాన్ ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్న వేళ పేదలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్, శ్రీను, వహీద్ తదితరులు పాల్గొన్నారు.