![]() |
![]() |
byసూర్య | Sat, Mar 18, 2023, 07:02 PM
మెదక్ జిల్లా రామయంపేటలో శుక్రవారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బైక్పై విచ్చిన ఇద్దరు దుండగులు ఓ మహిళ మెడలో నుంచి చైన్ను లాక్కెళ్లారు. వివరాల్లోకి వెళ్తే... రామాయంపేటలోని ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఒక మహిళ నిలబడి ఉంది. బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఆమె పక్కనే ఉండి ఎవరు లేని సమయం చూసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. కాగా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.