byసూర్య | Sat, Mar 18, 2023, 07:05 PM
పటాన్చెరు శ్రీనగర్ వాసి అఖిల్ (28) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గురువారం చందానగర్ గంగారంలో ఉన్న లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం కూడా బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు తట్టినా స్పందించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూశారు. అఖిల్ ఉరేసుకుని కనిపించాడు. తాను ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని, అందుకే చనిపోతున్నానని సూసైడ్ లెటర్ దొరికింది.ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.