![]() |
![]() |
byసూర్య | Sat, Mar 18, 2023, 07:08 PM
ఫార్మసీ రంగం సమాజానికి వెన్నుముక లాంటిదని డాక్టర్ టివి నారాయణ ఐపిఏల్ ప్రెసిడెంట్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో విష్ణు ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఔషద్ 2023 అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి ఈ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.