byసూర్య | Sun, Feb 05, 2023, 05:40 PM
జల్ పల్లి మున్సిపాలిటీ హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారంనాడు జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ్ కాలనీలో అనేక మంది యువకులు బీజేపీలో చేరారు. కౌన్సిలర్ ప్రశాంతి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో కాషాయం కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... దశాబ్దాలుగా జల్ పల్లి మున్సిపాలిటీని ఓటు బ్యాంకు రాజకీయాలకు మంత్రి సబితమ్మ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో జల్ పల్లి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు అందెల శ్రీరాములు యాదవ్. యువకులు ఎప్పటికప్పుడు భయపడకుండా సమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.