byసూర్య | Mon, Dec 05, 2022, 11:30 AM
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందని అన్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. నాలుగేళ్లలో కొడంగల్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదని, నిధులు వచ్చేంత వరకు ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేయాలన్నారు. నియోజకవర్గానికి నిధులు వచ్చుడో, లేదా ఎమ్మెల్యే సచ్చుడో తేలాలని అన్నారు. కొడంగల్ అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి టీఆర్ఎస్ ను ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు.