byసూర్య | Mon, Dec 05, 2022, 11:01 AM
రూ. 55లక్షల మున్సిపల్ నిధులతో మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో స్విమ్మింగ్ పూల్ నుంచి రైల్వే స్టేషన్, బాపూజీ నగర్ తదితర వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ డిఈ సాయిలక్ష్మి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున చారి, హనుమంత్ రెడ్డి, గోవింద్ రెడ్డి, షేక్ జావీద్, ఉదయ భాస్కర్, మలగం రేమేష్, నిరంజన్ రెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.