byసూర్య | Sun, Nov 27, 2022, 12:11 PM
కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా తన నాయకత్వాన్ని నలుగురే వ్యతిరేకిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ నలుగురు తప్ప మిగతా వారందరూ తన నాయకత్వాన్ని అంగీకరిస్తారని చెప్పారు. పార్టీలో అన్ని నిర్ణయాలూ అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తీసుకుంటారని, ఫలితాలు భిన్నంగా వస్తే అధ్యక్షుడే విఫలమయ్యారని అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ట్రస్టుకు సంబంధించి మర్రి శశిధర్ రెడ్డి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటికి లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరారని ఆరోపించారు.