నిత్యం జనంలో ఉండేలా...పాదయాత్రకు సిద్దమవుతున్న రేవంత్ రెడ్డి

byసూర్య | Sun, Nov 27, 2022, 11:59 AM

కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి గట్టెక్కించేందుకు పలు వ్యూహాలను పదునుపెడుతున్నారు. తాజాగా ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలన్న కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేయాలని తన సన్నిహితుల దగ్గర రేవంత్ వ్యాఖ్యానించినట్లు మీడియాలో కథనాలు వస్తోన్నాయి. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే పాదయాత్ర తప్ప వేరే మార్గం లేదనే ఆలోచనకు రేవంత్ వచ్చినట్లు చెబుతున్నారు.


రేవంత్ పాదయాత్రకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నుంచి పాదయాత్రను ప్రారంభించాలని రేవంత్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. రేవంత్ పాదయాత్రకు ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యనేతలు చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ బలపడాలంటే బస్సు యాత్ర లేదా పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నేతలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.


రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఎక్కువగా ఉంటుంది. దీంతో గతంలోనే రేవంత్ రెడ్డి కొంతమేర పాదయాత్ర చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుండటంతో.. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తారనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ఏడాదిలోపు పార్టీ బాగా పుంజుకోవాలంటే పాదయాత్ర చేయడం తప్ప వేరే ప్లాన్ లేదని అనుచరులకు రేవంత్ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.


పాదయాత్ర చేయడం ద్వారా నిత్యం ప్రజలకు టచ్‌లో ఉండటంతో పాటు నేతలను నేరుగా కలిసే అవకాశం ఉంటుందని, దీని వల్ల పార్టీలోని విబేధాలు కూడా సమసిపోయే అవకాశం ఉంటుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రేవంత్ పాదయాత్ర చేయాలంటే కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయినా రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్‌గా కొనసాగిస్తూనే ఉంది. వచ్చే ఎన్నికలలోపు పీసీసీ చీఫ్‌ను మార్చే ఉద్దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ లేదు.


రేవంత్ రెడ్డి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం మెండుగా ఉందని హస్తం పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఢిల్లీలో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించారు. పాదయాత్రపై కూడా చర్చించే ఉంటారని చెబుతున్నారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM