నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యయత్నం...కాలేజీలో కలకలం

byసూర్య | Fri, Aug 19, 2022, 09:09 PM

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లోని నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఏకంగా ప్రిన్సిపల్ గదిలోనే సందీప్ అనే విద్యార్థి తన ఒంటి మీద పెట్రోల్‌ పోసుకొని సూసైడ్ చేసుకోబోయాడు. టీసీ కోసం మాట్లాడుతూనే.. ప్రిన్సిపల్‌ ఎదురుగా నిప్పంటించుకున్నాడు. దీన్ని అడ్డుకున్న ప్రిన్సిపల్‌, సిబ్బందికి గాయాలయ్యాయి. మొత్తం ముగ్గురు గాయపడగా.. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత వేరే హాస్పిటల్లో చేర్పించారు.


సాయి నారాయణ అనే విద్యార్థి నారాయణ కాలేజీలో ఇంటర్ చదివాడు. అయితే.. కొన్నాళ్లుగా టీసీ కోసం తిరుగుతున్నా.. ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో.. టీసీ కోసం మరికొంతమందిని వెంటబెట్టుకుని కాలేజీకి వెళ్లాడు. టీసీ గురించి మాట్లాడుతుండగానే.. సాయి నారాయణ వెంట వచ్చిన సందీప్.. ప్రిన్సిపల్ను బెదిరించేందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కానీ.. ఆ గదిలో టేబుల్పై వెలిగించిన దీపం అంటుకుని మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్, ఏవో కూడా గాయపడ్డారు.


ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సాయి నారాయణ కాలేజీలో 16 వేల ఫీజు చెల్లించాలని పోలీసులు వెల్లడించారు. టీసీ కోసం సాయినారాయణ.. తనవెంట కొందరిని తీసుకొచ్చాడని.. వారిలో సందీప్‌ అనే విద్యార్థి పెట్రోల్‌ సీసాతో లోపలికి వచ్చాడని చెప్పారు. ప్రిన్సిపల్‌ను బెదిరించేందుకు తనపై పెట్రోల్‌ చల్లుకున్నాడని వివరించారు. కృష్ణాష్టమి ఆ రూములో టేబుల్‌పై దీపం వెలిగించారని.. అది అంటుకొని మంటలు చెలరేగి సందీప్‌, ప్రిన్సిపల్‌, ఏవోకు గాయాలయ్యాయని స్పష్టం చేశారు. అటు.. ఈ విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు కాలేజీపై దాడి చేసినట్టు తెలుస్తోంది. కాలేజీ అద్దాలు ధ్వంసం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించినట్టు సమాచారం.


Latest News
 

బాబుతో సహా వివాహిత అదృశ్యం Tue, May 07, 2024, 05:16 PM
నర్సరీ, జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ Tue, May 07, 2024, 05:14 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిఎస్ఓ Tue, May 07, 2024, 05:13 PM
ప్రియుడితో కలిసి భర్త మర్మాంగంపై దాడి చేసి హత్య Tue, May 07, 2024, 05:10 PM
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కేతేపల్లికి 'వార్నింగ్' Tue, May 07, 2024, 05:09 PM