byసూర్య | Tue, May 07, 2024, 05:14 PM
అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద చేపట్టిన పనులను పాఠశాలలు తెరిచేలోపు పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం టేక్రియాల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మున్సిపాలిటీ నర్సరీని, టేక్రియాల్ చౌరస్తాలో ఉన్న అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పనులు పురోగతిని పరిశీలించి పాఠశాలలో చేపడుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు.