byసూర్య | Tue, May 07, 2024, 05:13 PM
కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని తాత్పర్యం చేయకుండా వెంటనే లారీల నుండి అన్లోడ్ చేసుకోవాలని డీఎస్ఓ మల్లికార్జున్ బాబు రైస్ మిల్లర్ల యజమానులను ఆదేశించారు. మంగళవారం భిక్కనూరు, బిబిపేట్, పాల్వంచ మండలాలలోని రైస్ మిల్లులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉప తాసిల్దార్లతో కలిసి సందర్శించారు. లారీలు మిల్లులకు వచ్చిన మరుక్షణమే అన్లోడ్ చేసుకుని ట్రక్ షీట్ జారీ చేసి అక్నాలెడ్జ్మెంట్ రసీదు అందించాలన్నారు.