byసూర్య | Tue, May 07, 2024, 05:10 PM
వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన కోటగిరి మండలం ఎల్గొండలో చోటుచేసుకుంది. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య భార్య లక్ష్మికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న నాగయ్య ముక్కు, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చింది.