ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి: చాడ వెంకటరెడ్డి

byసూర్య | Thu, Aug 18, 2022, 09:10 AM

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడి సమస్యలను పరిష్కరించేది కేవలం కమ్యూనిస్టులే అని, ముందు ముందు ప్రజా వ్యతిరేక విధానాలను కార్యకర్తలు ఎండగట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) 3వ జిల్లా మహాసభలు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ ఫంక్షన్ హల్లో సీపీఐ నాయకులు జాగిరి సత్యనారాయణ, గడిపే మల్లేష్, కిష్టపురం లక్ష్మణ్, యాద పద్మ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలను సీపీఐ సీనియర్ నాయకులు ఈరి భూమయ్య పథకావిష్కరణ చేయగా, ముఖ్య అతిధులుగా హాజరైన చాడ వెంకటరెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి మహాసభలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ లు మాట్లాడుతూ. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని వారు అన్నారు. ప్రజలను ప్రభుత్వ వైఫల్యలను వివరించాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ కార్యకర్తల దేనని, ప్రభుత్వాలపై పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పుల బాలమల్లు, యెడల వనేశ్, కనుకుంట్ల శంకర్, అందే అశోక్, పోతిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆది రంగారెడ్డి, బెక్కంటి సంపత్, గజాబింకరి బన్సీలాల్, ఎగ్గొజు సుదర్శన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నే కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్ధన్, జిల్లా నాయకులు కొమ్ముల భాస్కర్, ముంజ గోపి, మంద శ్రీనివాస్, వేల్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బావిలో పడి వలస కూలీ మృతి Mon, Apr 29, 2024, 01:43 PM
వంశీకృష్ణని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:41 PM
లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు Mon, Apr 29, 2024, 01:37 PM
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ Mon, Apr 29, 2024, 01:35 PM
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం Mon, Apr 29, 2024, 01:32 PM