రక్తదానం చేసిన పాల్వంచ తహసీల్దార్

byసూర్య | Thu, Aug 18, 2022, 09:16 AM

స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్వంచ తహసిల్దార్ రంగా ప్రసాద్ రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని అంతర్జాతీయ క్రీడాకారిణి సింధు తపస్వి బుధవారం ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన 80 మంది రక్తదాతలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ముక్కుంటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమరాజు దొర, ఎయిడ్స్ అండ్ లెప్రెసి డిస్టిక్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, పాల్వంచ తహసిల్దార్ రంగా ప్రసాద్, పాల్వంచ పట్టణ ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM