byసూర్య | Thu, Aug 18, 2022, 09:16 AM
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్వంచ తహసిల్దార్ రంగా ప్రసాద్ రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని అంతర్జాతీయ క్రీడాకారిణి సింధు తపస్వి బుధవారం ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన 80 మంది రక్తదాతలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ముక్కుంటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమరాజు దొర, ఎయిడ్స్ అండ్ లెప్రెసి డిస్టిక్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, పాల్వంచ తహసిల్దార్ రంగా ప్రసాద్, పాల్వంచ పట్టణ ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.