byసూర్య | Thu, Aug 18, 2022, 09:07 AM
తెలంగాణలో 587 గ్రామాలకు మలేరియా ముప్పు ఉందని వైద్య శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటీవల ఆరోగ్యశాఖ చేసిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించారు. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు పరిధిలోని 24 పీహెచ్సీలు, 42 సీహెచ్సీలు, భూపాలపల్లి, వరంగల్ పరిధిలో 13 పీహెచ్సీలు, 26 సీహెచ్సీలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల పరిధిలోని 8 పీహెచ్సీలు, 10 సీహెచ్సీల్లో రిస్క్ ను గుర్తించారు.