byసూర్య | Wed, Aug 17, 2022, 01:00 PM
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్. మంగళవారం జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్న స్పీకర్ పోచారంకి పాజిటివ్ గా రిజల్ట్ వచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో వుంటారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ పోచారం తెలిపారు.