తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
byసూర్య |
Wed, Aug 17, 2022, 12:57 PM
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 27,348 శాంపిల్స్ పరీక్షించగా అందులో 406 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. హైదరాబాదులో 177 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. ఇంకా 581 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. గత 24 గంటల్లో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి 3,095 మంది చికిత్స తీసుకుంటున్నారు.
Latest News