భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ
byసూర్య |
Wed, Aug 17, 2022, 01:16 PM
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో సబ్ కలెక్టర్ మంగళవారం రాత్రి 8 గంటలకు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని, కావున గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.
Latest News