byసూర్య | Wed, May 25, 2022, 03:24 PM
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం (మే 23) నుంచి ప్రారంభమయ్యాయి. రవికుమార్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. హుజూరాబాద్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఇన్విజిలేటర్గా నియమితులయ్యారు. మంగళవారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షకు హాజరయ్యారు. అయితే తూలుతూ ఉండడంతో తనిఖీలకు వచ్చిన డీఈవో జనార్దన్ రావుకు అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేశాడు. బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించారు. ఆల్కహాల్ లెవల్స్ ఏకంగా 112కి చేరడంతో అధికారులు అవాక్కయ్యారు. వెంటనే అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.