byసూర్య | Wed, May 25, 2022, 03:22 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో గౌరవ మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సి శంభిపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి గారు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, జీహెచ్ఎంసీ 125 డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి గారు,126 డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ ,129 డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ,తెరాస పార్టీ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , సర్గారి ధర్మారెడ్డి , విష్ణు వర్ధన్ రెడ్డి , జీవన్ రెడ్డి , S. రాజిరెడ్డి , నాసి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.