byసూర్య | Sun, May 22, 2022, 09:22 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 8,260 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 29 కరోనా కేసులు పాజిటివ్గా తేలింది. హైదరాబాద్లో ఎక్కువగా 24 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 39 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,92,871 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,88,363 మంది కోలుకున్నారు. మరో 397 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.