byసూర్య | Sun, May 22, 2022, 02:57 PM
కాంగ్రెస్ పార్టీని అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ పార్టీయే బీజేపీతో కుమ్మకైందని కాంగ్రెస్ పార్టీ నేత సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు బీజేపీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఓ సిద్ధాంతం అంటూ ఏదీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేసినందుకే గత లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత ఓడిపోయారని ఆయన అన్నారు.