కేటీఆర్ నేతృత్వంలో పారిస్‌కు తెలంగాణ ప్రతినిధి బృందం

byసూర్య | Wed, Oct 27, 2021, 12:04 PM

హైదరాబాద్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం పయనమైంది. ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశం కానున్నారు. మంత్రితో పాటు ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులున్నారు.


Latest News
 

మోసకారుల మాటలు నమ్మద్దు : పద్మారావు గౌడ్ Fri, May 10, 2024, 02:22 PM
బోడుప్పల్ 5వ డివిజన్లో జోరుగ పద్మారెడ్డి ప్రచారం Fri, May 10, 2024, 02:21 PM
రెండు రోజులు మద్యం షాపులు బంద్ Fri, May 10, 2024, 02:20 PM
బిఆర్ఎస్ లో పలువురు బీజేపీ నాయకుల చేరిక Fri, May 10, 2024, 01:56 PM
ఉరేసుకుని యువకుడి సూసైడ్ Fri, May 10, 2024, 01:55 PM