byసూర్య | Wed, Oct 27, 2021, 11:52 AM
ఆదిలాబాద్ జిల్లాలోనే ఉట్నూర్ లో మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఉట్నూరు క్రాస్రోడ్డులోని ఐఎంఎల్డీ మద్యం డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా డిపో మొత్తానికి విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అంచనావేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.