ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది.. ఆసక్తికరంగా కేసీఆర్ వరుస ట్వీట్లు

byసూర్య | Sat, Apr 27, 2024, 07:26 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా ట్విట్టర్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన తొలిరోజే వరుస ట్వీట్లు చేస్తూ.. నెటిజనులను ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ పార్టీ స్థాపించిన నాటి ఫొటోను షేర్ చేస్తూ మొదటి ట్వీట్ చేసిన గులాబీ బాస్ .. ఆ తర్వాత గంటకే.. బస్సు యాత్రకు వస్తున్న స్పందనపై మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన కాసేపటికే మరో ఆసక్తికర ట్వీట్ చేశారు కేసీఆర్.


ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేసీఆర్ ట్వీట్ చేశారు. "తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతుందని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది..? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి." అంటూ కేసీఆర్ ట్వీట్ చేశారు.


కాగా.. అంతకుముందు బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ కేసీఆర్ ట్వీట్ చేశారు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం.. అంటూ ఆకాంక్షించారు గులాబీ బాస్.


Latest News
 

బిఆర్ఎస్ లో పలువురు బీజేపీ నాయకుల చేరిక Fri, May 10, 2024, 03:56 PM
కోరుట్లలో ఎమ్మెల్యే సంజయ్ ప్రచారం Fri, May 10, 2024, 03:55 PM
ఎమ్మెల్యే రాజా సింగ్ ను గజమాలతో సత్కరించిన కోఆర్డినేటర్ Fri, May 10, 2024, 03:53 PM
కాంగ్రెస్ లో చేరిన మాజీ ఉపసర్పంచ్ Fri, May 10, 2024, 03:51 PM
చెరువులో దూకిన యువకుడు మృతి Fri, May 10, 2024, 03:46 PM