byసూర్య | Fri, May 10, 2024, 03:46 PM
కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా దోమకొండ మండల కేంద్రానికి చెందిన గోత్రాల విక్రమ్(28) అనే యువకుడు చెరువులో దూకాడు. చివరగా తన మిత్రుడైన ప్రవీణ్ కు వీడియో కాల్ చేసిన విక్రమ్ తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. విషయం తెలుసుకున్న దోమకొండ ఎస్సై గణేష్ అక్కడికి చేరుకొని ఈతగాళ్లతో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం మృతదేహం బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.