byసూర్య | Fri, May 10, 2024, 03:51 PM
కామారెడ్డి నియోజకవర్గం పెద్దాయిపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ ఈర్ల శ్యామల లింగం బిఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామ చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.