byసూర్య | Wed, Mar 31, 2021, 02:38 PM
టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. హిమాయత్ నగర లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రతి ఫెడరేషన్కు రూ. 200 కోట్ల చొప్పున, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ. 500 కోట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుపేద బీసీలకు రుణాలు ఇవ్వని బ్యాంకులు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. లేదంటే బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని రుణాలకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 5 లక్షల 33 వేల మందికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు.