తెలంగాణలో తాజాగా 1,432 కరోనా కేసులు

byసూర్య | Thu, Oct 15, 2020, 10:42 AM

దక్షిణాదిన కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఏపీ, తమిళనాడులో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 1,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,17,670కి చేరింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 8 మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,249కి చేరింది.తెలంగాణలో కరోనా బారి నుంచి ఇప్పటివరకూ 1,93,218 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులున్నాయి. 19,084 మంది డాక్టర్ల సలహాలు, సూచనలతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 27,03,047 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM