byసూర్య | Thu, Oct 15, 2020, 09:40 AM
హైదరాబాద్ గచ్చిబౌలి టీఎన్టీవోస్ కాలనీవాసులు.. భూ ప్రకంపనలు, భారీ శబ్దాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి భూప్రకంపనల కారణంగా ఇండ్లలో వస్తువులు కదలడం, గేట్లు, ఆరుబయట సామగ్రి ఊగడంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జోరువానలో సైతం రోడ్డుపై, ఇండ్ల బయట ఉండిపోయిన కాలనీవాసులు తెల్లవారుజామున శబ్దాలు ఆగిపోవడంతో తిరిగి ఇండ్లలోకి వెళ్లారు. అధికారులకు సమాచారం ఇచ్చామని కాలనీ సంఘం అధ్యక్షుడు జంగయ్య తెలిపారు.