byసూర్య | Tue, Mar 31, 2020, 12:00 PM
కరోనా పాజిటివ్ కేసులపై కంట్రోల్ వస్తోంది కదా అనుకునే సమయంలో... ఢిల్లీ ప్రార్థనల అంశం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తెలంగాణలో ఆరుగురు మృతి చెందారు. మార్చి 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని సీఎం ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఏంటంటే "మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి #Coronavirus సోకింది. వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారు. ఢిల్లీలో మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మొత్తం 75 దేశాల నుంచి 8000 మంది దాకా ఈ ప్రార్థనలకు వెళ్లారు. వీళ్లలో ఒక్క తెలంగాణ నుంచే 280 మంది పాల్గొన్నట్లు తెలిసింది. వారిలో ఆరుగురు ఆల్రెడీ కరోనా పాజిటివ్ లక్షణాలతో చనిపోవడం మరో పెద్ద షాక్ అయ్యింది. దీంతో... ప్రభుత్వం... తెలంగాణలో ఏయే జిల్లాల నుంచి ఎంత మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారో డేటా సేకరించింది. ఆ డేటాను పరిశీలిస్తే...
ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు :
హైదరాబాద్ 186
నిజామాబాద్ 18