byసూర్య | Fri, Jan 17, 2020, 06:32 PM
ఆస్ట్రేలియా- భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా 6 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి వన్డే సెంచరీ వీరుడు వార్నర్ వికెట్ ను త్వరగా కోల్పోయింది. 15 పరుగులు చేసిన వార్నర్ షమీ బౌలింగ్ లో పాండేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్ డౌన్ లో స్మిత్ వచ్చాడు.