byసూర్య | Fri, Oct 11, 2019, 02:37 AM
ఆర్టీసీ కార్మికుల సమ్మె తో వారిపై వేటు వేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మరో సమ్మె పోటు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్శాఖ కార్మికులు సమ్మెతో ‘షాక్’ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన వరంగల్ డిస్కమ్ కార్యాలయం వద్ద చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వం దిగి రాకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యోగులతో 16వ తేదీన హైదరాబాద్ నగరంలోని సదరన్ డిస్కమ్ ఎదుట నిరసన చేయడానికి 21 ట్రేడ్ యూనియన్లు సిద్ధమవుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించినా ఆ ప్రయత్నాల దిశగా ఎలాంటి చర్యలు లేవని, అలాగే ఉద్యోగాల భర్తీ తదిరత డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ టీఈటీయూఎఫ్ యూనియన్ ఆరోపిస్తోంది. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 23వ తేదీన మహాధర్నా చేస్తామని అందుకు అవసరమైతే రాజకీయ పార్టీల మద్దుతు కూడా తీసుకుంటామని టీఈటీయూఎఫ్ చైర్మన్ పద్మారెడ్డి హెచ్చరించారు. దీంతో ఆర్టీసీతో పాటు విద్యుత్ సంఘాలు కూడా సమ్మె బాట పడితే రాష్ట్రం అధకారం అవుతుందన్న ఆందోళనలో జనం ఉన్నారు.