byసూర్య | Thu, Oct 10, 2019, 12:53 PM
హైదరాబాద్: జలవిహార్లో అలయ్ బలాయ్ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమాన్ని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేశారు. అలాయ్ బలాయ్లో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, మాజీ ఎంపీ వీ హన్మంతరావు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు గవర్నర్ దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.