ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 15కు వాయిదా

byసూర్య | Thu, Oct 10, 2019, 02:06 PM

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తాను కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి 10 రోజుల గడువు కావాలని ఆర్టీసీ గుర్తింపు సంఘాలు, జేఏసీ ధర్మసనాన్ని కోరాయి. సమస్య పరిష్కారానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 15వ తేదీనికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ హైకోర్టుకు తెలిపింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈనెల 15లోగా పూర్తి వివరాలతో ఆర్టీసీ కార్మికులు కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బస్‌పాస్‌లు చెల్లుబాటు అయ్యేలా, అధిక ఛార్జీలు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM