రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, May 07, 2024, 10:13 PM

ఇటీవల కాలంలో ఫేక్ కాల్స్ బెడద ఎక్కువైంది. మన నెంబర్లు వారి చేతికి ఎలా వెళ్తాయో తెలీదు కానీ.. కాల్ చేసి విసిగిస్తుంటారు. క్రిడెట్ కార్డు బ్లాక్ అయిందని.. ఈఎంఐ పెండింగ్ ఉందని ఇలా రకరకాల కారణాలు చెబుతూ మన బుర్రతినేస్తారు. తాజాగా.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొందరు కేటుగాళ్లు ఝలక్ ఇచ్చారు. వెహికిల్ లోన్ తీసుకుని రాజాసింగ్‌ ఫోన్ నంబర్ ఇవ్వడంతో బ్యాంక్ టెలీకాలర్ ఏకంగా ఆయనకే ఫోన్ చేసి ఈఎంఐ కట్టాలని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్‌గా మారింది.


వివరాల్లోకి వెళ్తే... వెహికిల్ లోన్ కట్టాలంటూ ఓ ప్రముఖ బ్యాంక్ నుంచి ఒక టెలీ కాలర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫోన్ చేసింది. ఇర్ఫాన్ అనే వ్యక్తి షేక్ మహమ్మద్ పేరిట వెహికిల్ లోన్ తీసుకున్నారని, ఫోన్ నంబర్ ఇదే ఇచ్చారంటూ ఆమె రాజాసింగ్‌కు వివరించింది. అందుకు బదులిచ్చిన రాజాసింగ్.. ఎవరి పడితే వారు నెంబర్ ఇస్తే కాల్ చేస్తారా? అంటూ టెలీ కాలర్‌ను ప్రశ్నించారు. తాను ఇర్ఫాన్ కాదని, ఎమ్మెల్యే రాజాసింగ్‌నని 'ముస్లింలకు అయ్యను' అంటూ కొంచెం ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు.


టెలీ కాలర్ స్పందిస్తూ.. ఈ నంబర్ ఇవ్వడం వల్లే తాను కాల్ చేశామని చెప్పగా... తన గురించి గూగుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవాలని రాజాసింగ్ సూచించారు. ముస్లింలకు, తనకు ఎక్కడైనా మ్యాచ్ అయితదా? అంటూ ప్రశ్నించారు. లోన్ తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్యే రాజాసింగ్ నంబర్ ఇవ్వడంతో ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి పొరపాటుగా ఫోన్ నంబర్ తప్పు ఇచ్చాడా.. లేక కావాలని ఇచ్చాడా? అన్నది తెలియాల్సి ఉంది.


Latest News
 

హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్ Sun, May 19, 2024, 07:34 PM