byసూర్య | Wed, May 08, 2024, 10:26 AM
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు కార్యకర్తలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్బంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.