byసూర్య | Sun, Aug 18, 2019, 01:50 PM
వరంగల్: సర్వాయి పాపన్న 370వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాపన్న జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు పాల్గొన్నారు.