byసూర్య | Sun, Aug 18, 2019, 01:47 PM
గాంధీభవన్లో కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఈరోజిక్కడ ఆమె మాట్లాడుతూ పార్టీ మారుతున్నాననే ప్రచారం కూడా గాంధీభవన్లోనే ప్రారంభమైందన్నారు. పార్టీ విడిచివెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానని పేర్కొన్నారు. హడావుడి నిర్ణయాలు తీసుకోనని, ఇదే విషయాన్ని ఉత్తమ్కు స్పష్టం చేశానన్నారు.