byసూర్య | Sun, Aug 18, 2019, 01:46 PM
హైదరాబాద్: రాజేంద్రనగర్లో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా టిప్పర్ దూసుకురావడంతో స్థానికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు ధ్వంసం కాగా ప్రాణనష్టం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై టిప్పర్ను పార్క్ చేసిన డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో టిప్పర్ హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లల్లోకి దూసుకెళ్లింది.