byసూర్య | Thu, Mar 21, 2019, 01:49 PM
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీకి, పొలిట్బ్యూరో పదవికి రాజీనామా చేసిన నామా నాగేశ్వర్రావు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నామా నాగేశ్వర్రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం నామా నాగేశ్వర్రావుకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నామాతో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ కుమారి, అమర్నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్బాబు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.