byసూర్య | Tue, Jan 22, 2019, 03:55 PM
త్రిపుర: అసోం బీఎస్ఎఫ్ అధికారులు త్రిపురలో 31 మంది రోహింగ్యా ముస్లింలను అరెస్ట్ చేశారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య జీరో పాయింట్ వద్ద చిక్కుకున్న రోహింగ్యాలను బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు అగర్తలలోని అంటాలీ పోలీసులకు రోహింగ్యాలను అప్పగించారు. అరస్టైన వారిలో 12 మంది పిల్లలున్నారు. సోమవారం రాత్రి గువాహటికి చెందిన బస్సులో వచ్చిన రోహింగ్యాలు గత నాలుగు రోజులుగా జీరో పాయింట్ వద్ద ఉండిపోయారని త్రిపుర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రోహింగ్యాలను విచారించి కరీంగంజ్ లోని స్థానిక కోర్టులో హాజరుపరుస్తామన్నారు.