మాజీ ఎమ్మెల్యేలు వెంటనే ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ చేయాలి :పోచారం శ్రీనివాస్ రెడ్డి

byసూర్య | Tue, Jan 22, 2019, 04:01 PM

 రాష్ట్ర శాసనసభ్యులకు సంబంధించిన నూతన క్వార్టర్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివిధ పార్టీల నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మరో శాసనసభ్యుడు నామినేట్ అయ్యారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు అధునాతన సౌకర్యాలతో ఇండ్లు నిర్మించారు. 4.5 ఎకరాల్లో నిర్మించిన ఇండ్ల సముదాయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కమిటీ వేసుకొని నియమ నిబంధనల మేరకే ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఒక్కో ఫ్లాట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగిందన్నారు. వాహనాల పార్కింగ్ కోసం 3 సెల్లార్లను నిర్మించామని తెలిపిన పోచారం.. ఒకేసారి 200 వాహనాలను నిలిపే విధంగా నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఇండ్ల నిర్మాణం రూ. 166 కోట్లతో జరిగిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM