byసూర్య | Mon, Jan 14, 2019, 07:43 AM
జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత హతమయ్యారు. డుంకా జిల్లా చాటుపడా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కమాండర్ సహదేవ్ రాయ్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సహదేవ్రాయ్పై గతంలో ప్రభుత్వం రూ.10లక్షల రివార్డు ప్రకటించింది. ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.