byసూర్య | Mon, Jan 14, 2019, 07:18 AM
కామారెడ్డి : టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని పిట్లం, రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ అంజయ్య, 20 మంది కార్యకర్తలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.