భారీగా పెరిగిన మాంసం ధర!

byసూర్య | Mon, Jan 14, 2019, 08:06 AM

 పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మాంసానికి గిరాకీ పెరిగింది. ఫలితంగా మటన్ ధరలు ఒక్కసారిగా పైకెగశాయి. గత మూడు నాలుగు రోజుల్లోనే ప్రాంతాలను బట్టి కిలోకు రూ. 50 నుంచి రూ. 60 వరకు పెరిగింది. దీంతో  కిలో మాంసం ధర ఏకంగా రూ. 600 దాటేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు హైదరాబాద్ వచ్చి మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తుండడమే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.నిజానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే మేకలు, గొర్రెల సంఖ్య ఎక్కువ. మహారాష్ట్ర వ్యాపారులు నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మేకలు, గొర్రెలను విక్రయించేవారు. అయితే, ఇటీవల అది కూడా తగ్గడంతో మాంసం ధరలు ఊపందుకున్నాయి. అలాగే, తలసరి మాంసం వినియోగం పెరుగుతుండడం కూడా ఇందుకు మరో కారణమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ ఏటా 20 శాతం పెరుగుతోందని పశుసంవర్థక శాఖ కూడా చెబుతోంది.


Latest News
 

మదీనా మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Mar 29, 2024, 12:51 PM
శ్రీనివాసరెడ్డిని కలిసిన ప్రగతి నగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు Fri, Mar 29, 2024, 12:51 PM
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసి Fri, Mar 29, 2024, 12:46 PM
సీఎం రేవంత్ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు Fri, Mar 29, 2024, 12:31 PM
కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM