ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు

byసూర్య | Wed, Apr 24, 2024, 03:15 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు అయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోదీ రాష్ట్రానికి రానున్నారు.పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడ బీజేపీ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు.అనంతరం వచ్చే నెల 3, 4 తేదీల్లోనూ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో నారాయణపేట్, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరవుతారు. అయితే రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం.


Latest News
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు....కవిత పిటిషన్‌ను రేపు విచారించనున్నకోర్టు Thu, May 09, 2024, 11:40 PM
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM