పరీక్షల్లో ఫెయిలయ్యానని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్.. ఎంత విషాదం

byసూర్య | Wed, Apr 24, 2024, 07:19 PM

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాలు వెల్లడి కాగా.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పట్టణానికి చెందిన తేజస్విని ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రాయగా.. ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విద్యార్థిని కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తమ కూతురు మరణవార్త విని తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


అయితే విద్యార్థిని ఆత్మహత్య ఆందోళన కలిగించే అంశం. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశానికిలోనై ఎంతో విలువైన ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. పరీక్షలే జీవితం కాదనే విషయాన్ని నేటి తరం విద్యార్థులు గమనించాలి. చదువు జీవితంలో ఓ భాగం మాత్రమే.. చదువుకోకున్నా.. చాలా మంది తాము అనుకున్న రంగంలో సక్సెస్ అయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిని స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలే కానీ.. ఆత్మహత్యలు చేసుకోవటం సరైంది కాదు.


కాగా, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకూడదని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. మే 24వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM